Friday, October 19, 2012

తెలుగు సాహిత్యం - ప్రాఙ్నన్నయ యుగము


తెలుగు సాహిత్యం - ప్రాఙ్నన్నయ యుగము

క్రీ.పూ. 200 నుండి క్రీ.శ. 600 వరకు తెలుగు భాషకు ఆరంభ దశగాను, 600 నుండి 900 వరకు బాషా వికాస దశగాను, 900 నుండి సాహిత్య వికాస దశగాను చెప్పవచ్చును."
తెలుగు సాహిత్యంలో క్రీ.శ. 1000 వరకు ప్రాఙ్నన్నయ యుగము అంటారు. తెలుగులో మొదటి కావ్యం మదాంధ్ర మహాభారతం అనీ, అది ఆరంభించిన నన్నయ ఆదికవి అనీ సార్వత్రికమైన అభిప్రాయం. ఒక్కమారుగా అంత పరిణతి చెందిన కావ్యం ఆవిర్భవించడం అసాధ్యమనీ, అంతకు ముందే ఎంతో కొంత సారస్వతం ఉండాలనీ సాహితీ చరిత్రకారులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నా ఏ విధమైన లిఖిత సాహిత్యం గాని, లిఖిత సాహిత్యం ఆధారాలు గాని లభించనందున తెలుగు సాహిత్యావిర్భావానికి నన్నయనే యుగపురుషునిగా అంగీకరిస్తారు. కనుక నన్నయకు పూర్వకాలాన్ని ప్రాఙ్నన్నయ యుగంఅని వ్యవహరిస్తున్నారు.

ఏమైనా తెలుగుభాష మూలాన్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు. అయినా కూడా, క్రీ.పూ. మొదటి శకంలో శాతవాహన రాజులు సృష్టించిన "గాధాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత్ పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు, శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగాకృష్ణగోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారై ఉంటారని నిర్ణయించవచ్చు. తెలుగు భాష మూలపురుషులు యానాదులు. పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష ప్రాచీనత 2,400 సంవత్సరాలనాటిది[1].

ఆదిమ ద్రావిడ భాషల చరిత్ర క్రీస్తుకు పూర్వం కొన్ని శతాబ్దాల వెనకకు మనము తెలుసుకోవచ్చు, కానీ తెలుగు చరిత్రను మనము క్రీస్తు శకం 6 వ శతాబ్దము నుండి ఉన్న ఆధారములను బట్టి నిర్ణయించవచ్చు. తెలుగు లోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శకం ఎ.డి. కి చెందినది. శాసనాలలో మనకు లభించిన తొలితెలుగు పదం 'నాగబు'. చక్కటి తెలుగు భాషా చరిత్రను మనము క్రీస్తు శకం 11 వ శతాబ్దం నుండి గ్రంథస్థము చేయబడినదిగా గమనించ వచ్చు.
ఆంధ్రులగురించి చెప్పిన పూర్వపు ప్రస్తావనలలో ఒకటి ఇక్కడ ఉదాహరింపబడినది: [2]
పియమహిళా సంగామే సుందరగత్తేయ భోయణీ రొద్దే
అటుపుటురటుం భణంతే ఆంధ్రేకుమారో సలోయేతి
ఇది ఉద్యోతనుడు ప్రాకృతభాషలో రచించిన కువలయమాల కథలోనిది. ఈ ప్రాకృతానికి పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రితెలుగు అనువాదం:
అందగత్తెలన్నా, అధవా యుద్ధరంగమన్ననూ సమానంగా ప్రేమిచే వాళ్ళున్నూ, అందమైన శరీరాలు గల వాళ్ళున్నూ. తిండిలో దిట్టలున్నూ, అయిన ఆంధ్రులు అటూ, పుటూ (పెట్టు కాబోలు), రటూ (రట్టు ఏమో) అనుకొంటూ వస్తుండగా చూచాడు.
కాళ్ళకూరు నారాయణరావు తన "ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహము"లో ఈ యుగాన్ని క్రింది భాగాలుగా విభజించాడు.[3]
  • అజ్ఞాత యుగము: క్రీ.పూ. 28 నుండి క్రీ.త. 500 వరకు:ఆంధ్రుల భాష గురించి కేవలం అక్కడక్కడా ఉన్న ప్రస్తావనల ద్వారా తెలుస్తున్న కాలం
  • లబ్ధ సారస్వతము: క్రీ.త. 500 నుండి 1000 వరకు.:శాసనాల వంటిని కొన్ని లభించిన కాలం

Editorial 16-6-24

పాలస్తీనా సమస్య: సంక్షిప్త చరిత్ర రాజా బహ్లుల్ పాలస్తీనా సమస్య ఇటీవలి చరిత్రలో అత్యంత క్లిష్టమైన సమస్యలలో ఒకటి. ఇది ఇప్పుడు ఒక శతాబ్దానికి ప...